PRINT TIME: February 23, 2026 10:12 PM
డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు
డబ్బు కాదు, ఓటే గెలిచింది: గట్టుప్పల్లో ఆదర్శ సర్పంచ్ ఎన్నికలు
December 13, 2025 06:43 AM
15 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామం ప్రజాస్వామ్యానికి అరుదైన ఉదాహరణగా నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రానికే ఆదర్శంగా మారింది.
ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఎన్నికల ముందు నుంచే డబ్బులు పంచకూడదని పరస్పరంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ మాటను నిలబెట్టుకున్న వారు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా డబ్బు రహితంగా నిర్వహించారు.
అభ్యర్థుల నిజాయితీకి, గ్రామస్థుల చైతన్యానికి ఇది నిదర్శనమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యం డబ్బుతో కాదు, ఓటుతోనే నిలుస్తుందనే సందేశాన్ని తేరట్పల్లి గ్రామం చాటిచెప్పింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి