Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:14 AM

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు
April 14, 2026 07:55 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి,మహానీయ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం,సమానత్వం,హక్కుల పరిరక్షణ సిద్ధాంతాలు దేశ నిర్మాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి,సమాన అవకాశాల కల్పనలో అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు పీసరి తిరుమలరెడ్డి,చిర్ర రవీందర్,గాజుల బాలరాజు,జితేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి,మల్గా అశోక్,భుమాండ్ల సతీష్,సుల్తాన్ మహేందర్,పల్లె చందు,గడ్డం రమేష్,బోడ హరికృష్ణ,ఆలేటి నాగరాజు, కొండల్ రెడ్డి, రేగు ఉపేందర్,జివిలికపల్లి శ్రీను,చొప్పరి సాయికుమార్,రేగు శ్రీశైలం,సందీప్,అఖిల్,బాబు,పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News