డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు
డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు
Sthanikam District Staff Reporter
భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి,మహానీయ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం,సమానత్వం,హక్కుల పరిరక్షణ సిద్ధాంతాలు దేశ నిర్మాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి,సమాన అవకాశాల కల్పనలో అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు పీసరి తిరుమలరెడ్డి,చిర్ర రవీందర్,గాజుల బాలరాజు,జితేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి,మల్గా అశోక్,భుమాండ్ల సతీష్,సుల్తాన్ మహేందర్,పల్లె చందు,గడ్డం రమేష్,బోడ హరికృష్ణ,ఆలేటి నాగరాజు, కొండల్ రెడ్డి, రేగు ఉపేందర్,జివిలికపల్లి శ్రీను,చొప్పరి సాయికుమార్,రేగు శ్రీశైలం,సందీప్,అఖిల్,బాబు,పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి