చౌటుప్పల మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులు పోటీ
చౌటుప్పల మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులు పోటీ
K.RAVI
పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలి
పదవులు ఆభరణం కాదు పోరాటానికి ఆయుధంగా ఉంటుంది
ఎండీ జాహంగీర్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,జిల్లా కార్యదర్శి
చౌటుప్పల మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ పోటీచేస్తుందని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించగల పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు.చౌటుప్పల మండల కమిటీ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు రాగిరు కిష్టయ్య అధ్యక్షత న జరిగింది. ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ, రాజకీయం వ్యాపారంగా మారిందని అలాటి డబ్బు రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలనే వారి ఎత్తులను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. పదవులు ఆభరణంకాదని అది పోరాటానికి ఆయుధంగా ఉంటుందని, అలాంటి పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే ప్రజలు గెలిపించాలని కోరారు. చౌటుప్పల మున్సిపాల్టిలో నెలకొన్న సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించినఘనత సిపిఎం పార్టీకి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి,శ్రీనివాస్ చారి,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం,మండల కార్యదర్శి గంగాదేవి సైదులు,మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి,చింతల సుదర్శన్, బోయ యాదయ్య,మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, అంతటి అశోక్, కొండే శైలం,ఎనమల్ల సంజీవ,మీసాల శీను,కొంతం సుశీల, రోడ్డ సోని తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి