Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..
February 12, 2026 06:41 AM 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అపూర్వ చైతన్యాన్ని ప్రదర్శించారు.పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 91.91 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం.ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించగా, సాయంత్రం వరకు అదే ఉత్సాహం కొనసాగింది. చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని 20 వార్డుల్లో మొత్తం 25,801 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,963 మంది మహిళలు,12,838 మంది పురుష ఓటర్లు ఉండగా.. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 11,931 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 11,782 మంది పురుషులు ఓటేశారు. శాతాలవారీగా చూసిన మహిళల పోలింగ్ అధికంగా నమోదవడం గమనార్వం.

కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూలైన్లు కనిపించినా..

ప్రజాస్వామ్యం పట్ల మహిళల నిబద్ధత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పలు కేంద్రాలలో మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పోలింగ్ సజావుగా సాగింది.యువతతో పాటు వృద్ధులు కూడా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూ లైన్ లు కనిపించినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింది. ఇంత భారీ శాతంలో పోలింగ్ నమోదవడం అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటరు తీర్పు ఎటు మొగ్గు చూపిస్తుందో ఆన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది. చౌటుప్పల్ లో నమోదైన ఈ రికార్డు స్థాయి పోలింగ్ ప్రజాస్వామ్యానికి ప్రజలు ఇచ్చిన గొప్ప మద్దతుగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News