Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..
February 12, 2026 06:41 AM 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అపూర్వ చైతన్యాన్ని ప్రదర్శించారు.పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 91.91 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం.ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించగా, సాయంత్రం వరకు అదే ఉత్సాహం కొనసాగింది. చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని 20 వార్డుల్లో మొత్తం 25,801 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,963 మంది మహిళలు,12,838 మంది పురుష ఓటర్లు ఉండగా.. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 11,931 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 11,782 మంది పురుషులు ఓటేశారు. శాతాలవారీగా చూసిన మహిళల పోలింగ్ అధికంగా నమోదవడం గమనార్వం.

కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూలైన్లు కనిపించినా..

ప్రజాస్వామ్యం పట్ల మహిళల నిబద్ధత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పలు కేంద్రాలలో మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పోలింగ్ సజావుగా సాగింది.యువతతో పాటు వృద్ధులు కూడా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూ లైన్ లు కనిపించినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింది. ఇంత భారీ శాతంలో పోలింగ్ నమోదవడం అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటరు తీర్పు ఎటు మొగ్గు చూపిస్తుందో ఆన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది. చౌటుప్పల్ లో నమోదైన ఈ రికార్డు స్థాయి పోలింగ్ ప్రజాస్వామ్యానికి ప్రజలు ఇచ్చిన గొప్ప మద్దతుగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News