చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం
చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం
K.RAVI
చౌటుప్పల్ లో బీ-ఫామ్ గందరగోళం
చివరి నిమిషంలో రాజకీయ మలుపు
బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ గూటికి..!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా భావించిన చింతల ఉమామహేశ్వరి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున బీఫామ్ సమర్పించడం రాజకీయంగా కలకాలం రేపింది.ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను తప్పించడంతోపాటు, ఉమామహేశ్వరికి కాంగ్రెస్ బీఫామ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేశారంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి