చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ
చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ
K.RAVI
మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి
చౌటుప్పల్ మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ రెండో రోజున మొత్తం 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ వార్డుల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఉపసంహరణ పత్రాలను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి వివరాలు: పెద్దగోని పారిజాత 2వ వార్డు,ప్రవీణ పర్నే 3వ వార్డు,పర్నే రజిత 3వ వార్డు,సంధ్యా వెన్ రెడ్డి 7వ వార్డు,నందగిరి భీమయ్య 8వ వార్డు,గోశిక నరసింహ 9వ వార్డు, వనం ధనంజయ 9వ వార్డు,వెన్ రెడ్డి సంధ్య 11వ వార్డు,బొంగు మహేష్ 12వ వార్డు, బత్తుల వాణి 16వ వార్డు, పుడుత మంజుల 18వ వార్డు, మోగుదాల రమేష్ 19వ వార్డు, మానస సురవి19వ వార్డు,ఎన్నికల నిబంధనల ప్రకారం గడువు ముగిసే సమయానికి 03.02.2026 సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి