చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో గోగులోతు అరుణ శంకర్ నాయక్ మున్సిపల్ ఎన్నికల 18 వ వార్డ్ బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆమెకు ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గోగులోతు అరుణ శంకర్ నాయక్ తెలిపారు.18 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
“నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి” అని ఆమె ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి