Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:56 PM

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం
January 31, 2026 01:40 PM 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం బీసీ వర్గాలవారు పోటీ పడడం శుభ సూచికమని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజనులు,బీసీ లు ఎంతో చైతన్యంతో పోటీ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలు చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు.ప్రతి వార్డులోని ప్రజలు మద్యం, డబ్బులకు అమ్ముడుపోకుండా సమర్థుడైన నాయకుని యెంచుకొని వార్డు సమస్యలు పరిష్కరించుకోవాల న్నారు.ప్రజల వద్దనుంచి లంచాలు వసులుచేసే వారిని కాకుండ ప్రజల మధ్యనుండి ప్రజాకోరకై జీవించే నాయకుని యెంచుకోవాలని మున్సిపల్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి కాలుష్య కారక కంపెనీల నుండి డబ్బులు వసూలు చేసే వారిని కాకుండ కంపెనీలను యువత భవిష్యత్ ఉపాధినిచ్చే కేంద్రాలుగా వాడుకునే నాయకులను ఎన్నుకోవాలన్నారు.నీళ్లు, రోడ్లు,విద్యుత్,ప్రాధామిక వసతులు, వృద్ధులు,మహిళాలకు,యువతకు చేయూత నిస్తూ వారికి విద్య, ఉపాధికి మార్గాలు చూపుతూ మున్సిపాలిటీని మోడల్ సిటీ గా మరిపించే విధముగా తయారుచేసే నాయకులను యెంచుకోవాలన్నరు.ఓటుహక్కును ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలన్నారు.మన బ్రతుకులను మనం వేసే ఓటు ద్వారా 100శాతం మెరుగు పరుచుకోవచ్చన్నారు.గెలిచి ప్రజలని పట్టించుకొని వారిని ప్రజలు ముందుగ పసిగట్టి ఒడించాలని పిలుపునిచ్చారు. పోటీచేసిన ప్రతివారు మంచి ప్రణాళికలతో గెలిచి సేవ చేయాలని తెలిపారు.చౌటుప్పల్ మున్సిపాలిటీకి కౌన్సిలర్లు గా పోటీ చేస్తున్న మార్గం వసంత, ఉడుగు రమేష్ గౌడ్, మార్షం పూజ, కడారి కల్పన, ఉడుత శ్రీశైలం యాదవ్, పాక చిరంజీవి యాదవ్, ఆలే చిరంజీవి, బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్. ఎండి అన్నూబాయి తదితరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News