చౌరస్తాల సుందరికరణలో వివక్ష :మున్సిపల్ కమిషనర్కు వినపత్రం
చౌరస్తాల సుందరికరణలో వివక్ష :మున్సిపల్ కమిషనర్కు వినపత్రం
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాల సుందరికరణ కోసం పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల పథకం కింద రూపాయలు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో రాజీవ్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, సేవాలాల్ చౌరస్తా, బసవేశ్వర చౌరస్తాల సుందరికరణ చేపడతామని సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రకటించడంపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఉన్న అంబేద్కర్ చౌరస్తా సుందరికరణను పూర్తిగా విస్మరించడం తీవ్ర అభ్యంతరకరమని బహుజన నాయకులు పేర్కొన్నారు. ఇది కేవలం అంబేద్కర్ పై జరిగిన అవమానమే కాకుండా,యావత్ దళిత సమాజంపై జరిగిన అన్యాయంగా భావిస్తున్నామని తెలిపారు.ఈ వివక్షపూరిత వైఖరిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ నారాయణఖేడ్ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జి అనుముల తుకారం, అంబేద్కర్ భవనం ఇంచార్జి భీమ సేన సిద్ధు, ఎనిమిదవ వార్డు అధ్యక్షులు తుకారం, భీమ్రావు,రాములు,తదితరులు మున్సిపల్ కమిషనర్ కు వినపత్రం అందజేశారు.ఈ వినపత్రంలో అంబేద్కర్ చౌరస్తాను కూడా ఇతర చౌరస్తాల మాదిరిగానే సమానంగా సుందరికరణ చేయాలని,ఎలాంటి వివక్షతకు తావు లేకుండా నిధులను న్యాయంగా వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి