Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:32 PM

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ
February 10, 2026 03:27 AM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

నార్కట్ పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన బొల్లు వెంకటరెడ్డి (తండ్రి: గోపాల్ రెడ్డి) తన కుమారుడి వివాహ ఖర్చుల నిమిత్తం నాలుగు లక్షల 50 వేల రూపాయలను తీసుకువచ్చి తన ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఉదయం సుమారు 8 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పనిమీద బయటకు వెళ్లారు.

మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని గుర్తు తెలియని దొంగలు ఇనుప రాడ్డు సహాయంతో విరగొట్టి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.4,50,000 నగదుతో పాటు రెండు తులాల నర (2½ తులాలు) బంగారు నల్లపూసల గొలుసును దొంగలించి తీసుకెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బొల్లు వెంకటరెడ్డి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నార్కట్పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నార్కట్పల్లి సీఐ కే. నాగరాజుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలను సేకరించారు.

దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News