Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:56 AM

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ
10-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన బొల్లు వెంకటరెడ్డి (తండ్రి: గోపాల్ రెడ్డి) తన కుమారుడి వివాహ ఖర్చుల నిమిత్తం నాలుగు లక్షల 50 వేల రూపాయలను తీసుకువచ్చి తన ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఉదయం సుమారు 8 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పనిమీద బయటకు వెళ్లారు.

మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని గుర్తు తెలియని దొంగలు ఇనుప రాడ్డు సహాయంతో విరగొట్టి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.4,50,000 నగదుతో పాటు రెండు తులాల నర (2½ తులాలు) బంగారు నల్లపూసల గొలుసును దొంగలించి తీసుకెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బొల్లు వెంకటరెడ్డి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నార్కట్పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నార్కట్పల్లి సీఐ కే. నాగరాజుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలను సేకరించారు.

దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Sthanikam

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

Article Image

నార్కట్ పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన బొల్లు వెంకటరెడ్డి (తండ్రి: గోపాల్ రెడ్డి) తన కుమారుడి వివాహ ఖర్చుల నిమిత్తం నాలుగు లక్షల 50 వేల రూపాయలను తీసుకువచ్చి తన ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఉదయం సుమారు 8 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పనిమీద బయటకు వెళ్లారు.

మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని గుర్తు తెలియని దొంగలు ఇనుప రాడ్డు సహాయంతో విరగొట్టి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.4,50,000 నగదుతో పాటు రెండు తులాల నర (2½ తులాలు) బంగారు నల్లపూసల గొలుసును దొంగలించి తీసుకెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బొల్లు వెంకటరెడ్డి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నార్కట్పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నార్కట్పల్లి సీఐ కే. నాగరాజుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలను సేకరించారు.

దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News