Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:32 PM

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ
February 10, 2026 03:27 AM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన బొల్లు వెంకటరెడ్డి (తండ్రి: గోపాల్ రెడ్డి) తన కుమారుడి వివాహ ఖర్చుల నిమిత్తం నాలుగు లక్షల 50 వేల రూపాయలను తీసుకువచ్చి తన ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఉదయం సుమారు 8 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పనిమీద బయటకు వెళ్లారు.

మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని గుర్తు తెలియని దొంగలు ఇనుప రాడ్డు సహాయంతో విరగొట్టి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.4,50,000 నగదుతో పాటు రెండు తులాల నర (2½ తులాలు) బంగారు నల్లపూసల గొలుసును దొంగలించి తీసుకెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బొల్లు వెంకటరెడ్డి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నార్కట్పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నార్కట్పల్లి సీఐ కే. నాగరాజుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలను సేకరించారు.

దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News