చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు
చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు
Anjali
వరుసగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
27.5 గ్రాముల బంగారు ఆభరణాలు
380 గ్రాముల వెండి ఆభరణాలు
ఒక వెండి బిస్కెట్ చోరీలకు ఉపయోగించిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగిరి పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక ఆధారాలు, రాత్రి పహారా, వాహన తనిఖీలతో కేసును ఛేదించారు.దేవాలయాల భద్రత కోసం ఎస్పీ ముఖ్య సూచనలు:- ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బలమైన తాళాలు వినియోగించాలి,హుండీ నగదును బ్యాంకుల్లో భద్రపరచాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 / 112 కు సమాచారం ఇవ్వాలి జూదం, మద్యం వంటి వ్యసనాలు వ్యక్తులను నేరాల దారి పట్టిస్తున్నాయని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.కేసును విజయవంతంగా ఛేదించిన రామగిరి సీఐ ఎస్.ఎం. అలీ, ఎస్సైలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి