చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు
చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు
K.RAVI
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను చౌటుప్పల్ మండల, మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మునుగోడు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్, మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాజు,ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి గోగినేని కృష్ణ తేజ, నాయకులు బొంగు బాద్షా, ఉపేంద్ర చారి, చెరుకు అశోక్, అంతటి కృష్ణయ్య, గుర్రపు యాదగిరి, ఆంజనేయులు, గోషిక పాండు, గొల్లపూడి దినేష్, కొమ్మరల సంజయ్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి