చంపాపేట్ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన “ఏవీఎస్ ప్లే జోన్” బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు, బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హాజరై నిర్వాహకులతో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఆట స్థలాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్లే జోన్ పిల్లలకు వినోదంతో పాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో చిన్నారుల కోసం ఇలాంటి కేంద్రాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.
అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి