చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం
చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం
Sthanikam District Staff Reporter
మోటకొండూరు: మండల పరిధిలోనిచందేపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాలను మార్చ్ 15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమం విగ్రహ దాతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోట్ల నగేష్,ఉప సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి,కార్యదర్శి శశిధర్ రెడ్డి,పాలక వర్గం సభ్యులకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను రాగిరి రితీష్,జ్ఞానేశ్వర్,లు అందజేశారు. అనంతరం గ్రామంలోని పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కి.శే. వండేపల్లి ఎల్లయ్య,రాజయ్య,పెద్ద గండయ్య మరియు చిన్న గండయ్యల కుమారులు వండేపల్లి రాంచందర్ (రాగిరి),అంజయ్య,వీరస్వామి,యాదగిరి,నగేష్, శంకర్,రితీష్,రాజా,జ్ఞానేష్ మా కుటుంబ సభ్యులంత కలిసి గ్రామ ప్రజలు,పెద్దలందరి సహకారంతో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని,మార్చ్15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమనికి,పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది,గ్రామ ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాగర్,సంజీవ,మంజుల,నాగరాజు,జ్యోతి,సబిత,పంచాయతీ సిబ్బంది పరమేశ్,లక్ష్మీ నర్సయ్య,గణేష్,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి