Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు డి.హరినాధ్

చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు డి.హరినాధ్

చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు డి.హరినాధ్
February 17, 2026 12:59 AM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ప్రజా హక్కుల ర్యాలీ నిర్వహించటం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక వారి ఆందోళనపక్కదారి పట్టించడానికి తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెరమీదకు తెచ్చారని హరినాద్ ఆరోపించారు.మంత్రి పార్థసారథి కనీసం రోడ్లను కూడా మెరుగుపరచలేకపోయారని తన అనుయాయులకు కాంట్రాక్ట్ లు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక దేశం నాయకులు కూడా అసమ్మతి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సమస్య అటవీ భూముల సమస్య చిత్తపూరు లాంటి గ్రామాల్లో స్మశానభూమి సమస్య లు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. మెట్ట ప్రాంతానికి వరప్రదాయని చింతలపూడి ఫేస్ టు ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా అమలు చేయాలని జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు. పీపుల్స్ సిక్స్ డిమాండ్స్ సాధనకై మార్చి రెండవ తేదీ జిల్లా కేంద్రం ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పుల్లారావు తెలిపారు ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య చాట్ల బాబురావు కలపాలవెంకటేశ్వరరావు దుర్గం పూజిత భవాని సీతామాలక్ష్మి సర్వేశ్వరరావు భూతం మారయ్య కళావతి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News