చందన స్కూల్లో దంత పరీక్షా శిబిరం
చందన స్కూల్లో దంత పరీక్షా శిబిరం
K.RAVI
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్లోని చందన స్కూల్లో మంగళవారం దంత పరీక్ష, చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురపాలక చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు.స్కూల్ ప్రిన్సిపాల్ రామేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో దంత వైద్యుడు డా. పాశం శివకుమార్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పాక చిరంజీవి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు.అనంతరం చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ“పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం”.విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, మంచి ఆరోగ్య అలవాట్లు చిన్ననాటి నుంచే అలవర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకుడు నాగభూషణం, రిటైర్డ్ సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు, పూర్వ మండల నాయకుడు శంకర్, స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్, అధ్యాపక బృందం కే. స్వప్న, పద్మ, అర్చన, గీత, జగదీశ్వరి, స్వప్న, లావణ్య, దీప, తేజ, ఉష, సంధ్యారాణి, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి