Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:50 AM

చిట్యాల మున్సిపాలిటీ వార్డు ప్రజల మద్దతు కోరుతూ గడపగడప ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ వార్డు ప్రజల మద్దతు కోరుతూ గడపగడప ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ వార్డు ప్రజల మద్దతు కోరుతూ గడపగడప ప్రచారం
January 10, 2026 12:38 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి 8వ వార్డు అభ్యర్థి కుక్కల మోహన్

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డు అభ్యర్థి కుక్కల మోహన్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి వీధి, ప్రతి గడపను తట్టుకుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తన విజన్‌ను ఓటర్లకు వివరించారు.

ప్రజలతో సన్నిహితంగా మమేకమవుతూ, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మోహన్ స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

“ఇన్నాళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిని అయ్యాను. ఈసారి వార్డు ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది” అని అన్నారు.

ప్రచారంలో పాల్గొన్న స్థానిక నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, కుక్కల మోహన్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

ఇంటింటి ప్రచారంతో పాటు యువత, మహిళలు, వృద్ధులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ, వార్డు భవిష్యత్ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న కుక్కల మోహన్ ప్రచారం చిట్యాలలో చర్చనీయాంశంగా మారింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News