చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలను మంగళవారం రోజున ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం ముందు భోగి మంటలు వెలిగించారు, హరిదాసు సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గంగిరెద్దు ఆటలు , విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే కాకుండా , మన సాంప్రదాయాలను కాపాడుకునే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకుంటారని కొత్త పంటలతో గ్రామాలు కలకలాడుతాయన్నారు. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి ఈ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పట్టణంలోని మహిళలు, చిన్నారులు చిట్యాల పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి