Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:35 AM

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం
16-01-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏఐసీసీ టీయూ ఆధ్వర్యంలో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు కలపాల వెంకటేశ్వరరావు ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2 ప్లస్ 50 గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన విద్యుత్ చట్టం2023 రద్దు చేయాలని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, రైతాంగ రుణమాఫీ చట్టం చేయాలని నూతన విత్తన చట్టం రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. కార్మికులకు పని గంటల పెంచుతూ చేసిన చట్టం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలని కోరారు.

Sthanikam

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

Article Image

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏఐసీసీ టీయూ ఆధ్వర్యంలో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు కలపాల వెంకటేశ్వరరావు ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2 ప్లస్ 50 గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన విద్యుత్ చట్టం2023 రద్దు చేయాలని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, రైతాంగ రుణమాఫీ చట్టం చేయాలని నూతన విత్తన చట్టం రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. కార్మికులకు పని గంటల పెంచుతూ చేసిన చట్టం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News