Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం
January 16, 2026 01:49 PM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏఐసీసీ టీయూ ఆధ్వర్యంలో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు కలపాల వెంకటేశ్వరరావు ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2 ప్లస్ 50 గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన విద్యుత్ చట్టం2023 రద్దు చేయాలని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, రైతాంగ రుణమాఫీ చట్టం చేయాలని నూతన విత్తన చట్టం రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. కార్మికులకు పని గంటల పెంచుతూ చేసిన చట్టం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News