చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం
చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏఐసీసీ టీయూ ఆధ్వర్యంలో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు కలపాల వెంకటేశ్వరరావు ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2 ప్లస్ 50 గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన విద్యుత్ చట్టం2023 రద్దు చేయాలని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, రైతాంగ రుణమాఫీ చట్టం చేయాలని నూతన విత్తన చట్టం రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. కార్మికులకు పని గంటల పెంచుతూ చేసిన చట్టం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి