Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:23 PM

చిత్తపూరు స్మశాన భూములలో కబ్జాదారును తొలగించి ప్రజలకు స్వాధీనపరచాలి! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్!

చిత్తపూరు స్మశాన భూములలో కబ్జాదారును తొలగించి ప్రజలకు స్వాధీనపరచాలి! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్!

చిత్తపూరు స్మశాన భూములలో కబ్జాదారును తొలగించి ప్రజలకు స్వాధీనపరచాలి! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ  మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్!
February 11, 2026 03:59 PM 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిత్తపూరు స్మశాన భూములలో కబ్జాదారును తొలగించి ప్రజలకు స్వాధీనపరచాలి! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామం ఇందిరా కాలనీ దళితవాడలో అనారోగ్య కారణంగా ఆడమిల్లి సుభద్రమ్మ చనిపోయినారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు భౌతిక కాయానికి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు .ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ. మౌలిక వసతులు లేని గ్రామం ఏదైనా ఉందంటే అది స్మశానంతో సమానం కానీ, చిత్తపూరు గ్రామానికి సుమారు ఆరు ఎకరాల స్మశాన భూమి కలదని స్మశాన భూమి కబ్జాలకు గురైందని స్థానికంగా ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్వో చోద్యం చూస్తున్నారు తప్ప ఆక్రమణలకు గురైన స్మశాన భూమి గుర్తించి ఆక్రమణదారులను తొలగించుటలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. నాలుగు నెలలుగా స్మశాన భూమికి సంబంధిత పత్రాలు సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా నేటికీ ఇవ్వలేదన్నారు.రెవెన్యూ అధికారులు స్వలాభాలకు ఆశపడుతూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి కనీస గౌరవ మర్యాదలు కల్పించటలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చనిపోయిన భౌతిక కాయాలను సొంత భూములు ఉన్నవారు దహన కార్యక్రమాలు చేసుకుంటున్నారని, ఏ భూమి లేని నిరుపేదలు వాగులు, చెరువులు, గుంటలలో దహన కార్యాలు చేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని, సంబంధిత అధికారులు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు .తక్షణం స్థానిక మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న క్షేత్రస్థాయిలో స్మశాన వాటిక భూములను పరిశీలన చేసి కబ్జాదారులను తొలగించి గ్రామపంచాయతీకి అప్పగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.అప్పుడే, చనిపోయిన వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో గ్రామంలో ప్రజలను కూడగట్టుకుని సంబంధిత కార్యాలయం వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలపాల వెంకటేశ్వరరావు, వేముల బక్కయ్య, చాట్ల బాబురావు, పల్లెపాము భవాని ,ఆడమిల్లి వెంకటేశ్వరరావు, అడిమెల్లి యేసు రత్నం , ఆడిమల్లి ముసలయ్య, ఆడమిల్లి చంటి ,అడిమెల్లి మల్లయ్య, అడిమెల్లి నాని, కోపూరి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News