చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్
ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వుల అందజేత
చింతలపూడి: చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్ను నియమించినట్లు స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రకటించారు.
ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే స్వయంగా రమేష్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయలక్ష్మి, ఆర్ఎంఓ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గతంలో పనిచేసిన సభ్యుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ రమేష్ను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సలహా సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కొత్త బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణ, పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి