చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు
చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు
GADDAM JAGANMOHAN REDDY
చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ చొరవ తో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరారు ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిణి శ్రీమతి షబ్నమ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం బస్ డిపో మేనేజర్లు, ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు అంతకుముందు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో MLA రోషన్ కుమార్ తో సమావేశం అయ్యారు చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో చర్చించారు డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తే డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి