Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

చింతలపూడి కనకదుర్గా ఫైనాన్స్ లో జరిగిన దొంగ తాపాన్ని చేధించిన పోలీస్ లు

చింతలపూడి కనకదుర్గా ఫైనాన్స్ లో జరిగిన దొంగ తాపాన్ని చేధించిన పోలీస్ లు

చింతలపూడి కనకదుర్గా ఫైనాన్స్ లో జరిగిన దొంగ తాపాన్ని చేధించిన పోలీస్ లు
January 28, 2026 05:47 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి జనవరి 28(స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్-డివిజన్, చింతలపూడి సర్కిల్, తేదీ: 28.01.2026

చింతలపూడి పోలీస్ స్టేషన్.

Cr.No. 256/2025 U/s 318(4), 316(5) & Sec 61(2) r/w 3 (5) B.N.S of Chintalapudi Police Station.

నేరం వివరాలు:

నేరం జరిగిన తేది: 09.09.2025 సాయంత్రం సుమారు 05.00 గం. ల సమయంలో

స్థలం: కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్, పాత బస్టాండు సెంటర్, చింతలపూడి.

రిపోర్ట్ చేసిన సమయం: 09.09.2025 at 08.00 PM

సంఘటన:

ది. 09.09.2025 ఉదయం 11 గం.ల సమయంలో కనకదుర్గ ఫైనాన్స్ హెడ్ ఆఫీసు నుండి ఆడిట్ చేయు నిమిత్తం ఆడిటర్ అయిన వడ్లమూడి ఉమా మహేశ్ చింతలపూడి బ్రాంచ్ కి వచ్చి, నిబందనలకు విరుద్దంగా లాకర్లలోని మొత్తం బంగారాన్ని బయటపెట్టి, మద్యాహ్నం వరకు ఆడిట్ నిర్వహించినారు. సాయంత్రం సమయంలో బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ బయటకు వెళ్ళగా, అదే అదునుగా భావించి ముద్దాయి అక్కడ ఉన్న క్యాషియర్ ఆశాశ్రీను ను కూడా కొబ్బరినీళ్లు వంకతో బయటకు పంపి, ముందుగా తనతో తీసుకువచ్చిన బాగ్లో మొత్తం 378 కవర్లలోని 4.490 kg ల బంగారు ఆభరణాలను (ఇప్పటి విలువ సుమారు రూ. 7,00,00,000/-లు ) తన బాగ్ లో వేసుకుని పారిపోయాడు.

దర్యాప్తు:

ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ K.P.S. కిషోర్, పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ASP శ్రీమతి సుస్మితా, మరియు జంగారెడ్డిగూడెం ఇంచార్జ్ DSP U. రవి చంద్ర ఆధ్వర్యంలో, T. క్రాంతి కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చింతలపూడి సర్కిల్ మరియు వారి సిబ్బంది, ఏలూరు జిల్లా సైబర్ సెల్ మరియు ఐ‌టి కోర్ వారి సహకారంతో గాలింపు చేపట్టి, పై కేసులో ముద్దాయి అయిన వడ్లమూడి ఉమా మహేశ్, తండ్రి: మాల కొండయ్య, వయసు: 38 సంవత్సరాలు, వృత్తి: ఆడిట్ ఎగ్జిక్యూటివ్, కనకదుర్గ ఫైనాన్స్, నివాసం: నాయుడుపేట, నెల్లూరు జిల్లా అనువారిని తేది 28.01.2026 నాడు అరెస్ట్ చేసి, చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేశారు

నిందితుని వివరాలు:

వడ్లమూడి ఉమా మహేశ్, తండ్రి: మాల కొండయ్య, 38 సం, ఆడిట్ ఏక్సికుటివ్, కనకదుర్గ ఫైనాన్స్, నివాసం, నాయుడుపేట, నెల్లూరుజిల్లా.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1) 4.484 కే‌జిల బంగారు ఆభరణాలు (ఇప్పటి విలువ సుమారు 7, 00, 00,000/-)

2) POCO M7 మొబైల్ ఫోన్.

3) ముదురాకు పచ్చ రంగు షోల్డ్డర్ బాగ్

దర్యాప్తులో పాల్గొన్న సిబ్బంది:

ఈ కేసులో దర్యాప్తులో పాలుపంచుకున్న సిబ్బంది ని ఎస్పీ అభినందించారు.

Smt. R.Sushmita, IPS, ASP, Jangareddyguem Sub-Division.

Sri U. Ravi Chandra, DSP, Incharge SDPO, Jangareddyguem

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News