చిట్యాలలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
చిట్యాలలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
Komidala Mahender reddy
వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టిన మున్సిపల్ పాలకవర్గం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చిట్యాల పురపాలక సంఘం పరిధిలో ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని 2వ మరియు 9వ వార్డుల్లో విస్తృత స్థాయిలో పారిశుధ్య పనులు నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. సీసీ రోడ్ల పక్కన పిచ్చిగా పెరిగిన కంపచెట్లు, అడవి మొక్కలను తొలగించి వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. దోమల నివారణకు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురుగు కాలువలపై బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణాన్ని ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు, వార్డు కౌన్సిలర్లు షబానా అజీమ్, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, నిమ్మనగోటి శ్రీనివాస్, నాగిళ్ల సుధాకర్, జెర్రిపోతుల సత్యనారాయణతో పాటు మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి