Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:18 AM

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ  వాహన యజమానిపై కేసు నమోదు
February 23, 2026 07:22 PM 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు తొమ్మిది ఆవులను రక్షించి గోశాలకు తరలించారు.

చిట్యాల పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ ఎదుట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో దగ్గర దగ్గరగా కట్టేసి ఊపిరాడకుండా తొమ్మిది ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆవులను కోదాడ నుంచి హైదరాబాద్ నగరంలోని కళేబరాల మార్కెట్‌కు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అవసరమైన అనుమతులు లేకుండా, జంతు సంక్షేమ నిబంధనలు పాటించకుండా తరలించడం స్పష్టమైందని తెలిపారు.ఈ ఘటనపై వాహన యజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, ఆవులను సంరక్షణ నిమిత్తం సమీప గోశాలకు తరలించినట్టు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

అక్రమ గోవుల రవాణాపై పోలీసులుకఠినంగావ్యవహరిస్తామని, జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరింత విస్తరించనున్నట్లు పోలీసు వర్గాలు సూచించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News