చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు
చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు తొమ్మిది ఆవులను రక్షించి గోశాలకు తరలించారు.
చిట్యాల పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ ఎదుట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో దగ్గర దగ్గరగా కట్టేసి ఊపిరాడకుండా తొమ్మిది ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆవులను కోదాడ నుంచి హైదరాబాద్ నగరంలోని కళేబరాల మార్కెట్కు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అవసరమైన అనుమతులు లేకుండా, జంతు సంక్షేమ నిబంధనలు పాటించకుండా తరలించడం స్పష్టమైందని తెలిపారు.ఈ ఘటనపై వాహన యజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, ఆవులను సంరక్షణ నిమిత్తం సమీప గోశాలకు తరలించినట్టు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.
అక్రమ గోవుల రవాణాపై పోలీసులుకఠినంగావ్యవహరిస్తామని, జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరింత విస్తరించనున్నట్లు పోలీసు వర్గాలు సూచించాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి