Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ  వాహన యజమానిపై కేసు నమోదు
February 23, 2026 07:22 PM 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు తొమ్మిది ఆవులను రక్షించి గోశాలకు తరలించారు.

చిట్యాల పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ ఎదుట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో దగ్గర దగ్గరగా కట్టేసి ఊపిరాడకుండా తొమ్మిది ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆవులను కోదాడ నుంచి హైదరాబాద్ నగరంలోని కళేబరాల మార్కెట్‌కు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అవసరమైన అనుమతులు లేకుండా, జంతు సంక్షేమ నిబంధనలు పాటించకుండా తరలించడం స్పష్టమైందని తెలిపారు.ఈ ఘటనపై వాహన యజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, ఆవులను సంరక్షణ నిమిత్తం సమీప గోశాలకు తరలించినట్టు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

అక్రమ గోవుల రవాణాపై పోలీసులుకఠినంగావ్యవహరిస్తామని, జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరింత విస్తరించనున్నట్లు పోలీసు వర్గాలు సూచించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News