Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:35 PM

చిట్యాలలో పెరిగిన ఓటు విలువ పార్టీల పోటీ ఆఫర్లు

చిట్యాలలో పెరిగిన ఓటు విలువ పార్టీల పోటీ ఆఫర్లు

చిట్యాలలో పెరిగిన ఓటు విలువ పార్టీల పోటీ ఆఫర్లు
February 10, 2026 11:28 AM 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ : చిట్యాలలో ఓటుకు ‘బంగారు ధర’

పోల్ మేనేజ్‌మెంట్‌లో తగ్గేదెలే..!

చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రోజురోజుకీ ముదురుతోంది. పోల్ మేనేజ్‌మెంట్ కేంద్రంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. “తగ్గేదేలే” అన్నట్టుగా రెండు పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో ఓటర్లే టార్గెట్‌గా వ్యూహాలు పదునెక్కుతున్నాయి.ఈ ఎన్నికల్లో ఓటుకు మంచి రేటు పలుకుతోందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని, అదే స్థాయిలో పార్టీల అభ్యర్థులు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది.నగదు మాత్రమే కాకుండామందు బాటిల్స్చీరెలుఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లకు రవాణా ఖర్చులుఅన్నీ భరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ ఈ పోటీ తగ్గడం లేదని సమాచారం. ప్రతి ఓటూ కీలకమేనన్న భావనతో అభ్యర్థులు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎవరు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పోటీగాప్రలోభాలకుపాల్పడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ.మొత్తానికి చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు అభివృద్ధి కంటే ప్రలోభాలే ప్రధాన ఆయుధంగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు విలువ ప్రజాస్వామ్యానికి పునాది అయితే, దానికి ఇంత బారీ ధర కట్టడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News