Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన
April 01, 2026 04:19 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేంద్ర కార్మిక విధానాలపై తీవ్ర నిరసన.. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో చిట్యాలలో నల్ల జెండాలతో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం అమలు చేయబోతున్న కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు “బ్లాక్ డే”గా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ రూపంలో బలహీనపరచడం విచారకరమని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రదర్శనలో కార్మికులు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాలపైభారంగామారుతున్నాయని నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, గుడిసె లక్ష్మీనారాయణతో పాటు సిఐటియు నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, ఎం.డి. అఫ్జల్, జడల నర్సింహా, బాకీ అండాలు, ధనలక్ష్మి, యమున, జిట్ట నరేష్, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, దూడెల యాదయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News