Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:43 AM

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన
01-04-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేంద్ర కార్మిక విధానాలపై తీవ్ర నిరసన.. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో చిట్యాలలో నల్ల జెండాలతో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం అమలు చేయబోతున్న కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు “బ్లాక్ డే”గా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ రూపంలో బలహీనపరచడం విచారకరమని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రదర్శనలో కార్మికులు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాలపైభారంగామారుతున్నాయని నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, గుడిసె లక్ష్మీనారాయణతో పాటు సిఐటియు నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, ఎం.డి. అఫ్జల్, జడల నర్సింహా, బాకీ అండాలు, ధనలక్ష్మి, యమున, జిట్ట నరేష్, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, దూడెల యాదయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

Sthanikam

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

Article Image

కేంద్ర కార్మిక విధానాలపై తీవ్ర నిరసన.. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో చిట్యాలలో నల్ల జెండాలతో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం అమలు చేయబోతున్న కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు “బ్లాక్ డే”గా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ రూపంలో బలహీనపరచడం విచారకరమని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రదర్శనలో కార్మికులు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాలపైభారంగామారుతున్నాయని నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, గుడిసె లక్ష్మీనారాయణతో పాటు సిఐటియు నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, ఎం.డి. అఫ్జల్, జడల నర్సింహా, బాకీ అండాలు, ధనలక్ష్మి, యమున, జిట్ట నరేష్, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, దూడెల యాదయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News