Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాట విష్ణు తల్లి మరణం… సీపీఎం నేతల సంతాపం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 06:05 PM

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన
April 01, 2026 04:19 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేంద్ర కార్మిక విధానాలపై తీవ్ర నిరసన.. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో చిట్యాలలో నల్ల జెండాలతో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం అమలు చేయబోతున్న కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు “బ్లాక్ డే”గా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ రూపంలో బలహీనపరచడం విచారకరమని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రదర్శనలో కార్మికులు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాలపైభారంగామారుతున్నాయని నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, గుడిసె లక్ష్మీనారాయణతో పాటు సిఐటియు నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, ఎం.డి. అఫ్జల్, జడల నర్సింహా, బాకీ అండాలు, ధనలక్ష్మి, యమున, జిట్ట నరేష్, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, దూడెల యాదయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News