చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
24 పోలింగ్ కేంద్రాలు కట్టుదిట్టమైన భద్రత
జడ్.పి.హెచ్.ఎస్లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 12,118 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 24 మంది రిసీడింగ్ అధికారులు, 24 మంది అసిస్టెంట్ రిసీడింగ్ అధికారులు, మిగిలిన 72 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. మంగళవారం రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని స్వీకరించిన సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.ఓటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా స్థానిక జడ్.పి.హెచ్.ఎస్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, సిబ్బంది హాజరు, భద్రతా ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించి ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత: సీఐ నాగరాజు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లో 13 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 75 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని ఆయన వివరించారు.
పోలింగ్ సామాగ్రిని సురక్షితంగా కేంద్రాలకు చేరవేశామని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకున్నామని సీఐ నాగరాజు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి