Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
February 10, 2026 06:02 PM 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

24 పోలింగ్ కేంద్రాలు కట్టుదిట్టమైన భద్రత

జడ్.పి.హెచ్.ఎస్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 12,118 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 24 మంది రిసీడింగ్ అధికారులు, 24 మంది అసిస్టెంట్ రిసీడింగ్ అధికారులు, మిగిలిన 72 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. మంగళవారం రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని స్వీకరించిన సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.ఓటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా స్థానిక జడ్.పి.హెచ్.ఎస్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, సిబ్బంది హాజరు, భద్రతా ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించి ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత: సీఐ నాగరాజు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లో 13 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 75 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని ఆయన వివరించారు.

పోలింగ్ సామాగ్రిని సురక్షితంగా కేంద్రాలకు చేరవేశామని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకున్నామని సీఐ నాగరాజు స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News