Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:41 AM

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు
03-04-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు పట్టివేత – మరొకరు పరార్

చిట్యాల: మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ దొంగతనాలతో భయాందోళన సృష్టించిన ముఠా ఎట్టకేలకు స్థానికుల చేతికి చిక్కింది. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రజలు ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించగా, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం.గత వారం రోజులుగా చిట్యాల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, దర్యాప్తు కొనసాగుతుండగానే ముఠా మరోసారి దొంగతనానికి పాల్పడింది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన సమయంలో అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసులు, ఈ ముఠా చిట్యాలకే పరిమితమా? లేక జిల్లా వ్యాప్తంగా దొంగతనాల్లో పాలుపంచుకున్నదా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

Article Image

స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు పట్టివేత – మరొకరు పరార్

చిట్యాల: మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ దొంగతనాలతో భయాందోళన సృష్టించిన ముఠా ఎట్టకేలకు స్థానికుల చేతికి చిక్కింది. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రజలు ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించగా, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం.గత వారం రోజులుగా చిట్యాల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, దర్యాప్తు కొనసాగుతుండగానే ముఠా మరోసారి దొంగతనానికి పాల్పడింది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన సమయంలో అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసులు, ఈ ముఠా చిట్యాలకే పరిమితమా? లేక జిల్లా వ్యాప్తంగా దొంగతనాల్లో పాలుపంచుకున్నదా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News