చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు
చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు
Komidala Mahender reddy
స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు పట్టివేత – మరొకరు పరార్
చిట్యాల: మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ దొంగతనాలతో భయాందోళన సృష్టించిన ముఠా ఎట్టకేలకు స్థానికుల చేతికి చిక్కింది. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రజలు ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించగా, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం.గత వారం రోజులుగా చిట్యాల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, దర్యాప్తు కొనసాగుతుండగానే ముఠా మరోసారి దొంగతనానికి పాల్పడింది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి మొబైల్ను దొంగిలించేందుకు ప్రయత్నించిన సమయంలో అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసులు, ఈ ముఠా చిట్యాలకే పరిమితమా? లేక జిల్లా వ్యాప్తంగా దొంగతనాల్లో పాలుపంచుకున్నదా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి