Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 02:52 PM

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు
April 03, 2026 12:09 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు పట్టివేత – మరొకరు పరార్

చిట్యాల: మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ దొంగతనాలతో భయాందోళన సృష్టించిన ముఠా ఎట్టకేలకు స్థానికుల చేతికి చిక్కింది. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రజలు ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించగా, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం.గత వారం రోజులుగా చిట్యాల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, దర్యాప్తు కొనసాగుతుండగానే ముఠా మరోసారి దొంగతనానికి పాల్పడింది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన సమయంలో అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసులు, ఈ ముఠా చిట్యాలకే పరిమితమా? లేక జిల్లా వ్యాప్తంగా దొంగతనాల్లో పాలుపంచుకున్నదా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News