చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..
చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడానికి నిరసిస్తూ బాధితురాలి తరఫున బంధువులు మంగళవారం జాతీయ రహదారి పై పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. బాధితురాలి బంధువులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం పిచ్చమ్మ సుమారు 60 చిట్యాల నుండి శివనేనిగూడెంకు తమకు తెలిసిన వ్యక్తి బైక్ పై వెళుతుండగా సమీపంలో ఎదురుగా అదే గ్రామానికి చెందిన నాగిల్ల యాదయ్య బైక్ పై వచ్చి వీరిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన పిచ్చమ్మ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నప్పటికీ సంఘటనకు కారణమైన వ్యక్తిని విచారించకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని ప్రమాదానికి గురైన వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే నేటికీ పోలీసులు విచారించకపోవడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితుని పై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి