Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:55 AM

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం
08-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

01వ వార్డులో అభివృద్ధి హామీలు

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ ప్రచారం జోరందుకుంది. 01వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐఎం అభ్యర్థి జిట్టా నాగేశ్ విజయం లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతామని తెలిపారు. అభివృద్ధి దిశగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ప్రజల ఆశలు నెరవేర్చే శక్తి ప్రజాపక్ష శక్తులకే ఉందని పేర్కొంటూ, అభ్యర్థి జిట్టా నాగేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Sthanikam

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం

Article Image

01వ వార్డులో అభివృద్ధి హామీలు

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ ప్రచారం జోరందుకుంది. 01వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐఎం అభ్యర్థి జిట్టా నాగేశ్ విజయం లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతామని తెలిపారు. అభివృద్ధి దిశగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ప్రజల ఆశలు నెరవేర్చే శక్తి ప్రజాపక్ష శక్తులకే ఉందని పేర్కొంటూ, అభ్యర్థి జిట్టా నాగేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News