Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:14 PM

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం

చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం
February 08, 2026 04:34 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

01వ వార్డులో అభివృద్ధి హామీలు

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ ప్రచారం జోరందుకుంది. 01వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐఎం అభ్యర్థి జిట్టా నాగేశ్ విజయం లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతామని తెలిపారు. అభివృద్ధి దిశగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ప్రజల ఆశలు నెరవేర్చే శక్తి ప్రజాపక్ష శక్తులకే ఉందని పేర్కొంటూ, అభ్యర్థి జిట్టా నాగేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News