చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం
చిట్యాలలో ఇంటింటి ప్రచారంలో వేముల వీరేశం
స్థానికం బృందం
01వ వార్డులో అభివృద్ధి హామీలు
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ ప్రచారం జోరందుకుంది. 01వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐఎం అభ్యర్థి జిట్టా నాగేశ్ విజయం లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతామని తెలిపారు. అభివృద్ధి దిశగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ప్రజల ఆశలు నెరవేర్చే శక్తి ప్రజాపక్ష శక్తులకే ఉందని పేర్కొంటూ, అభ్యర్థి జిట్టా నాగేశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి