PRINT TIME: March 14, 2026 09:20 AM
చిట్యాలలో గాలికుంటు టీకా శిబిరం ఆకస్మిక తనిఖీ
చిట్యాలలో గాలికుంటు టీకా శిబిరం ఆకస్మిక తనిఖీ
March 12, 2026 04:06 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
Chityala
Komidala Mahender reddy
చిట్యాల మండలంలో పశువులకు నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు నిరోధక టీకాల శిబిరాన్ని పశువైద్య & పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. జి.వి. రమేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమం నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.ఈ తనిఖీలో మండల పశువైద్యాధికారి డా. వి. అభినవ్, డా. అమరేందర్, విఎల్ఓ పి. శ్రీనివాస్, ఎల్ఎస్ఎ మల్లారెడ్డి, గోపాలమిత్ర సత్యనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి