Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 20, 2026 10:02 PM

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం
March 20, 2026 08:34 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక రిక్షా సంఘం అధ్యక్షుడు చిరుమర్తి బిక్షం మరియు కర్రె లింగస్వామి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మీ సైదులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఏడో వార్డు కౌన్సిలర్ కుక్కల లతా రాజేష్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించే చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పాటి నర్సిరెడ్డితో పాటు స్థానిక నాయకులు పోకల అశోక్, గుండెబోయిన సైదులు, బొబ్బలి రామ్ రెడ్డి, సిలువేరు శేఖర్, రంజిత్ , జన్నపాల శీను తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలమంతా చలివేంద్రం ద్వారా ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News