చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం
చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వరుసగా వాహనాల బ్యాటరీలు చోరీకి గురవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే రాత్రిలో రెండు వాహనాల బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా నివసిస్తున్న కొమిడాల మహేందర్ రెడ్డి తన రోజువారీ పనులు ముగించుకొని శనివారం రాత్రి చిట్యాల–భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఖాళీ స్థలంలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం అక్కడికి వచ్చి చూసేసరికి వాహనంలో ఉన్న బ్యాటరీ కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు.
ఇదే రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఇంటి ముందు ఉన్న మరో ట్రాక్టర్ బ్యాటరీని కూడా అదే రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా రెండు చోట్ల చోరీలు జరగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల రాత్రి వేళల్లో పెరుగుతున్న చోరీలపై పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి