Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం
March 15, 2026 11:42 AM 616 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వరుసగా వాహనాల బ్యాటరీలు చోరీకి గురవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే రాత్రిలో రెండు వాహనాల బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా నివసిస్తున్న కొమిడాల మహేందర్ రెడ్డి తన రోజువారీ పనులు ముగించుకొని శనివారం రాత్రి చిట్యాల–భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఖాళీ స్థలంలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం అక్కడికి వచ్చి చూసేసరికి వాహనంలో ఉన్న బ్యాటరీ కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు.

ఇదే రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఇంటి ముందు ఉన్న మరో ట్రాక్టర్ బ్యాటరీని కూడా అదే రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా రెండు చోట్ల చోరీలు జరగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల రాత్రి వేళల్లో పెరుగుతున్న చోరీలపై పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News