చిట్యాల మండలం పరిధిలోని వెలిమినేడు శివారులో జాతీయ రహదారి పక్కన నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరాలపై నల్గొండ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు విటులతో పాటు సూర్యాపేటకు చెందిన ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన మహిళలను సఖి కేంద్రానికి తరలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి