Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 06:08 PM

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
February 24, 2026 03:59 PM 231 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రతినిధులు ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొని సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.సంఘ గౌరవ అధ్యక్షులుగా ఏనుగు అంజిరెడ్డి, సంఘ అధ్యక్షులుగా కోమటిరెడ్డి రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చొప్పరి మల్లేశం, గుమ్మి నర్సిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శిగా జిట్ట బొందయ్య, సహాయ కార్యదర్శులుగా ఆగు వెంకన్న, బూడిద లింగస్వామి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా నారబోయిన శ్రీనివాస్, జిట్ట రాజయ్య, విట్టల్ రెడ్డి, చిర్రబోయిన నరసింహ, కొంతం సత్తిరెడ్డి, ఏర్పుల స్వామి, రేముడాల యాదయ్య, ఆగు నరసింహ, వరకాంతం నరేందర్ రెడ్డి, ఎడ్ల మాలింగం, రేముడాల శ్రీశైలం, నల్ల మహేందర్ రెడ్డి, రావుల మల్లారెడ్డి, చిర్రబోయిన రమేష్ లను ప్రతినిధులు ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రైతుల సమస్యల పరిష్కారం, సాగు నీటి వసతులు, పంటలకు కనీస మద్దతు ధర సాధన వంటి అంశాలపై సమిష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News