చిట్యాల మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ పందిరి గీత–రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి–సైదులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు.
చిట్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మౌలిక వసతుల మెరుగుదల, పరిశుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి