Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:35 PM

చిట్యాల మున్సిపాలిటీలో నూతన ప్రజా ప్రతినిధుల బాధ్యతలు స్వికారం

చిట్యాల మున్సిపాలిటీలో నూతన ప్రజా ప్రతినిధుల బాధ్యతలు స్వికారం

చిట్యాల మున్సిపాలిటీలో  నూతన ప్రజా ప్రతినిధుల బాధ్యతలు స్వికారం
February 22, 2026 11:53 AM 421 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ పందిరి గీత–రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి–సైదులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు.

చిట్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మౌలిక వసతుల మెరుగుదల, పరిశుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News