Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు
January 30, 2026 07:35 PM 345 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

12 వార్డులకు 73 మంది అభ్యర్థుల నుంచి 106 నామినేషన్లు.

నల్గొండ జిల్లా చిట్యాల. మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మొత్తం 12 వార్డులకు గాను 73 మందిఅభ్యర్థులు 106 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొదటి రోజు 9, రెండో రోజు 44, మూడో రోజు 73 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో అత్యధికంగా 15 నామినేషన్లు దాఖలవగా, 12వ వార్డులో అత్యల్పంగా 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. రెండో, మూడో వార్డుల్లో తలా 9, నాలుగో, ఐదో వార్డుల్లో తలా 7, ఆరో వార్డులో 8, ఏడో వార్డులో 10, ఎనిమిదో, తొమ్మిదో, పదకొండో వార్డుల్లో తలా 8, పదో వార్డులో 11 నామినేషన్లు దాఖలయ్యాయి.పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 34 నామినేషన్లు దాఖలవగా, బిఆర్ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 15, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్ర అభ్యర్థులుగా 7, బీఎస్పీ నుంచి 3, సీపీఐ నుంచి 3 నామినేషన్లు వచ్చాయి.దాఖలైన నామినేషన్లపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఆదివారం (1వ తేదీ) సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన చేపడతామని, నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News