చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు
చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు
Komidala Mahender reddy
12 వార్డులకు 73 మంది అభ్యర్థుల నుంచి 106 నామినేషన్లు.
నల్గొండ జిల్లా చిట్యాల. మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మొత్తం 12 వార్డులకు గాను 73 మందిఅభ్యర్థులు 106 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.
నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొదటి రోజు 9, రెండో రోజు 44, మూడో రోజు 73 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో అత్యధికంగా 15 నామినేషన్లు దాఖలవగా, 12వ వార్డులో అత్యల్పంగా 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. రెండో, మూడో వార్డుల్లో తలా 9, నాలుగో, ఐదో వార్డుల్లో తలా 7, ఆరో వార్డులో 8, ఏడో వార్డులో 10, ఎనిమిదో, తొమ్మిదో, పదకొండో వార్డుల్లో తలా 8, పదో వార్డులో 11 నామినేషన్లు దాఖలయ్యాయి.పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 34 నామినేషన్లు దాఖలవగా, బిఆర్ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 15, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్ర అభ్యర్థులుగా 7, బీఎస్పీ నుంచి 3, సీపీఐ నుంచి 3 నామినేషన్లు వచ్చాయి.దాఖలైన నామినేషన్లపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఆదివారం (1వ తేదీ) సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన చేపడతామని, నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి