Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు
January 30, 2026 07:35 PM 349 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

12 వార్డులకు 73 మంది అభ్యర్థుల నుంచి 106 నామినేషన్లు.

నల్గొండ జిల్లా చిట్యాల. మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మొత్తం 12 వార్డులకు గాను 73 మందిఅభ్యర్థులు 106 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొదటి రోజు 9, రెండో రోజు 44, మూడో రోజు 73 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో అత్యధికంగా 15 నామినేషన్లు దాఖలవగా, 12వ వార్డులో అత్యల్పంగా 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. రెండో, మూడో వార్డుల్లో తలా 9, నాలుగో, ఐదో వార్డుల్లో తలా 7, ఆరో వార్డులో 8, ఏడో వార్డులో 10, ఎనిమిదో, తొమ్మిదో, పదకొండో వార్డుల్లో తలా 8, పదో వార్డులో 11 నామినేషన్లు దాఖలయ్యాయి.పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 34 నామినేషన్లు దాఖలవగా, బిఆర్ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 15, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్ర అభ్యర్థులుగా 7, బీఎస్పీ నుంచి 3, సీపీఐ నుంచి 3 నామినేషన్లు వచ్చాయి.దాఖలైన నామినేషన్లపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఆదివారం (1వ తేదీ) సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన చేపడతామని, నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News