చిట్యాల మున్సిపాలిటీలో లో గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీ
చిట్యాల మున్సిపాలిటీలో లో గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీ
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రనగర్ కాలనీ ఏడవ వార్డులో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, ఏడవ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ గంగారం గణేష్ పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోకల అశోక్, మేడిశెట్టి ఉమాశంకర్, బోడ శ్రీను, గంటెపాక స్వామి, జిట్ట స్వామి, దేశపాక రాజేష్, అవిరెండి సుందర్, చిత్రగంటి నాగరాజు, చిరుమర్తి బిక్షం తదితరులు పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గించి ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి