చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుతో ఆశావాహులు నిరాశ
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుతో ఆశావాహులు నిరాశ
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 12 మంది అభ్యర్థులను ఖరారు చేయడంతో టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తమకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఒక్కసారిగా అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో, టికెట్ ఆశించిన నాయకులు షాక్కు గురైనట్లు సమాచారం. పార్టీ కోసం సంవత్సరాలుగా సేవలందించిన వారిని పక్కనబెట్టి కొందరికి మాత్రమే అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్గత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
టికెట్ దక్కని కొందరు నేతలు పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మౌనంగా ఉండిపోయారు. ఈ పరిణామాలు చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసంతృప్త నేతలను పార్టీ ఎలా సమన్వయం చేస్తుందన్నది, రానున్న మున్సిపల్ ఎన్నికలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి