చిట్యాల మున్సిపాలిటీలొ కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
చిట్యాల మున్సిపాలిటీలొ కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
చిట్యాల మున్సిపాలిటీ 06వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రణేయ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో చిట్యాలలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ…
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మనోజ్, గణేష్, స్వామి, భాను, హరికృష్ణ, సత్తీ, శ్రీకాంత్, సాయి, వెంకన్న తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి