Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:41 AM

చిట్యాల మున్సిపాలిటీలొ కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

చిట్యాల మున్సిపాలిటీలొ కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

చిట్యాల మున్సిపాలిటీలొ కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
February 02, 2026 06:18 PM 219 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

చిట్యాల మున్సిపాలిటీ 06వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రణేయ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో చిట్యాలలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ…

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మనోజ్, గణేష్, స్వామి, భాను, హరికృష్ణ, సత్తీ, శ్రీకాంత్, సాయి, వెంకన్న తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News