చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి
చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి
Komidala Mahender reddy
శివనేనిగూడెం ఫస్ట్ వార్డులో టెన్షన్… కార్యకర్తల తోపులాట, పోలీసుల జోక్యం
చిట్యాల,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
శివనేనిగూడెం గ్రామంలోని ఫస్ట్ వార్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కట్టంగూరు ఎస్సై రవీందర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపించాయి.‘కాంగ్రెస్ వాళ్లు 4000వేలిస్తే, బీఆర్ఎస్ వాళ్లు 5000వేలైనా పంచుకోండి’ అంటూ ఎస్సై వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి