చిట్యాలలో కాంగ్రెస్లో చేరికలు
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కమ్మంపాటి సతీష్, టీడీపీ నాయకులు అర్రూరి సత్తయ్య, వంగూరి నవీన్ తమ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రానున్న రోజుల్లో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి