చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు 12 వార్డులకు గాను 9 వార్డులు కైవసం
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు 12 వార్డులకు గాను 9 వార్డులు కైవసం
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. మొత్తం 12 వార్డులకు గాను 9 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా, బిఆర్ఎస్ రెండు వార్డుల్లో విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
1వ వార్డులో నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్ జెండర్) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 102 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2వ వార్డులో షబానా బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి 96 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు:
3వ వార్డు – గాలి యాదమ్మా లింగయ్య (302 మెజారిటీ)
4వ వార్డు – కోనేటి ఎల్లయ్య (181 మెజారిటీ)
5వ వార్డు – గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు (34 మెజారిటీ)
6వ వార్డు – జెరిపోతుల సత్యనారాయణ (89 మెజారిటీ)
7వ వార్డు – దేశపాక లత (11 మెజారిటీ)
8వ వార్డు – కుక్కల మోహన్ (142 మెజారిటీ)
9వ వార్డు – ఏర్పుల పరమేష్ (253 మెజారిటీ)
11వ వార్డు – మునగాల సందీపా (459 మెజారిటీ)
12వ వార్డు – పందిరి గీత రమేష్ (45 మెజారిటీ)
బిఆర్ఎస్ పార్టీ తరఫున 10వ వార్డులో నిమ్మనగోటి శ్రీను 97 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చిట్యాల మున్సిపాలిటీలో మెజారిటీ సాధించి పాలక మండలిలో ఆధిపత్యం చాటుకుంది. ముఖ్యంగా 11వ వార్డులో 459 ఓట్ల భారీ మెజారిటీ నమోదు కావడం విశేషం. 7వ వార్డులో కేవలం 11 ఓట్ల తేడాతో విజయం సాధించడం పోటీ తీవ్రతను ప్రతిబింబించింది.
ఈ ఫలితాలతో చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థానం సంపాదించగా, బిఆర్ఎస్ పరిమిత స్థాయిలోనే నిలిచింది. స్థానిక రాజకీయాల్లో ఈ ఫలితాలు కొత్త సమీకరణాలకు దారితీయనున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి