చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు
చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు
Komidala Mahender reddy
చిట్యాల మునిసిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.మునిసిపాలిటీ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కూరెళ్ల జ్యోతి లింగస్వామికి కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకులు పోలేపల్లి మాధవి, సత్యనారాయణ, పోకల రాములు పాల్గొని మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం 7వ వార్డులో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిందని ఓటర్లకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్లు తదితర అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని, కారుగుర్తుకు ఓటు వేసి కూరెళ్ల జ్యోతి లింగస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పోకల రమేష్, పాల చంద్రయ్య, బొజ్జ లింగస్వామి, బూడిద ప్రవీణ్ కుమార్, పాల నవీన్, సుంచు లింగయ్య, పాల ముత్తయ్య, కూరెళ్ల సురేష్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి