Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ కొత్త పనుల కోసం సంగెం గ్రామంలో గ్రామసభ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:27 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం
13-02-2026 355 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.

11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

Article Image


458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.

11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News