Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:39 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం
February 13, 2026 07:29 PM 345 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.

11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News