చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం
చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం
Komidala Mahender reddy
458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.
11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి