Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి భారీ విజయం
February 13, 2026 07:29 PM 341 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


458 ఓట్ల మెజార్టీతో గెలుపు – వార్డు అభివృద్ధికి కట్టుబాటు వ్యక్తం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి సందీప రామ్ రెడ్డి 458 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో ఆమె చిట్యాలలో వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ నమోదు చేశారు.

11వ వార్డులో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన సందీప రామ్ రెడ్డి, ఓటర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సందీప రామ్ రెడ్డి, “ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు. వార్డులో తాగునీటి సరఫరా మెరుగుదల, నీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ దీపాల ఏర్పాటు, రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News