చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిరుమర్తి లింగయ్య
చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిరుమర్తి లింగయ్య
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా టీ స్టాళ్ల వద్ద ఆగి పుర ప్రముఖులు, ఓటర్లతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మున్సిపాలిటీ అభివృద్ధిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
బిఆర్ఎస్ పార్టీ పాలనలో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. అలాగే పేదల సంక్షేమానికి అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును ప్రస్తావించారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన విమర్శలు చేశారు. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం మళ్లీ బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, చిట్యాల అభివృద్ధికి సహకరించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి