Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:13 AM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిరుమర్తి లింగయ్య

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిరుమర్తి లింగయ్య

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిరుమర్తి లింగయ్య
22-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా టీ స్టాళ్ల వద్ద ఆగి పుర ప్రముఖులు, ఓటర్లతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మున్సిపాలిటీ అభివృద్ధిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

బిఆర్ఎస్ పార్టీ పాలనలో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. అలాగే పేదల సంక్షేమానికి అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును ప్రస్తావించారు.

ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన విమర్శలు చేశారు. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం మళ్లీ బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, చిట్యాల అభివృద్ధికి సహకరించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిరుమర్తి లింగయ్య

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా టీ స్టాళ్ల వద్ద ఆగి పుర ప్రముఖులు, ఓటర్లతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మున్సిపాలిటీ అభివృద్ధిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

బిఆర్ఎస్ పార్టీ పాలనలో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు గుర్తు చేశారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. అలాగే పేదల సంక్షేమానికి అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును ప్రస్తావించారు.

ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన విమర్శలు చేశారు. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం మళ్లీ బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, చిట్యాల అభివృద్ధికి సహకరించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News