Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:29 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు
03-02-2026 298 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పోటీ చిత్రపటం స్పష్టమైంది. మొత్తం 12 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

పార్టీల వారీగా పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి నుంచి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి తలా 11 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 6 మంది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నుంచి 3 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో 6 మంది, రెండో మరియు మూడో వార్డుల్లో తలా 4 మంది, నాలుగో, ఐదో, ఆరవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏడవ, ఎనిమిదో, తొమ్మిదో వార్డుల్లో తలా 5 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పదో వార్డులో 2 మంది, పదకొండవ మరియు పన్నెండవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.


Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పోటీ చిత్రపటం స్పష్టమైంది. మొత్తం 12 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

పార్టీల వారీగా పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి నుంచి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి తలా 11 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 6 మంది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నుంచి 3 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో 6 మంది, రెండో మరియు మూడో వార్డుల్లో తలా 4 మంది, నాలుగో, ఐదో, ఆరవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏడవ, ఎనిమిదో, తొమ్మిదో వార్డుల్లో తలా 5 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పదో వార్డులో 2 మంది, పదకొండవ మరియు పన్నెండవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News