Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:40 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు
February 03, 2026 09:03 PM 289 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పోటీ చిత్రపటం స్పష్టమైంది. మొత్తం 12 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

పార్టీల వారీగా పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి నుంచి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి తలా 11 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 6 మంది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నుంచి 3 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో 6 మంది, రెండో మరియు మూడో వార్డుల్లో తలా 4 మంది, నాలుగో, ఐదో, ఆరవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏడవ, ఎనిమిదో, తొమ్మిదో వార్డుల్లో తలా 5 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పదో వార్డులో 2 మంది, పదకొండవ మరియు పన్నెండవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News