Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:42 AM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు
February 03, 2026 09:03 PM 282 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పోటీ చిత్రపటం స్పష్టమైంది. మొత్తం 12 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

పార్టీల వారీగా పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి నుంచి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి తలా 11 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 6 మంది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నుంచి 3 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో 6 మంది, రెండో మరియు మూడో వార్డుల్లో తలా 4 మంది, నాలుగో, ఐదో, ఆరవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏడవ, ఎనిమిదో, తొమ్మిదో వార్డుల్లో తలా 5 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పదో వార్డులో 2 మంది, పదకొండవ మరియు పన్నెండవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News