Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:14 AM

చిట్యాల మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ సిబ్బంది

చిట్యాల మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ సిబ్బంది

చిట్యాల మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన  మున్సిపల్ సిబ్బంది
19-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ నూతన చైర్మన్‌ పందిరి గీత రమేష్ ను మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిబ్బంది తరఫున పూలబొకేలు అందజేసి, నూతన చైర్మన్‌కు అభినందనలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాల్లో సమిష్టిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిబ్బంది తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను పాల్గొని మాట్లాడారు. పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలకు పారదర్శకమైన మరియు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో చిట్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ సిబ్బంది

Article Image

చిట్యాల మున్సిపాలిటీ నూతన చైర్మన్‌ పందిరి గీత రమేష్ ను మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిబ్బంది తరఫున పూలబొకేలు అందజేసి, నూతన చైర్మన్‌కు అభినందనలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాల్లో సమిష్టిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిబ్బంది తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను పాల్గొని మాట్లాడారు. పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలకు పారదర్శకమైన మరియు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో చిట్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని సంకల్పం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News