చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత రమేష్ ప్రమాణ స్వీకారం
చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత రమేష్ ప్రమాణ స్వీకారం
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.చైర్మన్గా పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్గా గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు స్థానిక అధికారుల సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, పట్టణ సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుత పాలన అందించేందుకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు మాట్లాడుతూ, ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, మహిళల సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.కార్యక్రమం ముగింపులో పలువురు నాయకులు నూతన పాలకవర్గాన్ని అభినందిస్తూ, చిట్యాల పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి